Saturday, April 19, 2025
HomeతెలంగాణTurkapally: బాటను కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

Turkapally: బాటను కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

బాటను కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన రైతులు బొడ్డెల్లి హరినాథ్, బొడ్డెల్లి ఆంజనేయులు, బొడ్డెల్లి మైపాల్ లు తుర్కపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ దేశ్యానాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామ రెవెన్యూ శివారులో గల సర్వే నెంబర్ 204లో 2.14 గుంటల భూమి మాకు కలదని అన్నారు. గత 50 సంవత్సరాల నుండి తాత ముత్తాతల నుండి మా సాగుభూమిలోకి వెళ్ళడానికి నడుస్తున్న బాటను కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకొని బాటను యధావిధిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. బాటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News