Sunday, July 7, 2024
HomeతెలంగాణWarangal: ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన

Warangal: ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన

27న ప్రజా ఆశీర్వాద సభ

ఈ నెల 27న బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న వర్దన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభా స్థలాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని భట్టుపల్లి లోని ఎస్సార్ కళాశాల పక్కన ఉన్న మైదానంలో 27వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్న వర్దన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ సభలో వర్దన్నపేట నియోజకవర్గ అభివృద్ధి, బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో పై ముఖ్యమంత్రి ప్రజలకు వివరించానున్నారని.. కావున నియోజకవర్గ ప్రజలు, ఉద్యమకారులు, మహిళలు, యువకులు భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News