Sunday, October 6, 2024
HomeతెలంగాణBhimadevarapalli: భీమదేవరపల్లి ఎంపిడిఓగా నాగంపల్లి వీరేశం

Bhimadevarapalli: భీమదేవరపల్లి ఎంపిడిఓగా నాగంపల్లి వీరేశం

భాస్కర్ బదిలీతో..

భీమదేవరపల్లి మండల నూతన ఎంపిడిఓగా నాగంపల్లి వీరేశం బాధ్యతలు స్వీకరించారు. లోకసభ ఎన్నికల దృష్ట్యా బదిలీల్లో భాగంగా గీసుకొండ మండల ఎంపిడిఓగా పనిచేసిన వారు భీమదేవరపల్లి మండలానికి బదిలీపై వచ్చారు. గత ఎంపిడిఓ భాస్కర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ ములుగు మండలానికి బదిలీపై వెళ్ళారు. ఎంపీడీవోకు ఎంపీపీ జక్కుల అనిత, మండల పంచాయతి కార్యదర్శులు, సిబ్బంది తదితరులు కలిసి ఎంపీడీవో కు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News