Monday, July 8, 2024
HomeతెలంగాణVemula floral tribute to Lasya Nandita: లాస్య నందిత మృతి పట్ల వేముల...

Vemula floral tribute to Lasya Nandita: లాస్య నందిత మృతి పట్ల వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బాల్కొండ ఎమ్మెల్యే, మాజి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి తన తండ్రి సాయన్న మృతి నుండి ఇంకా కోలుకొక ముందే, ప్రజా సేవలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు.

వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు,బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News