Tuesday, September 17, 2024
HomeతెలంగాణVinod Kumar: తెలంగాణ పట్ల ఎందుకింత వివక్ష?

Vinod Kumar: తెలంగాణ పట్ల ఎందుకింత వివక్ష?

 తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం, రాజకీయ అస్థిరత సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.  తెలంగాణ సమస్యలు, డిమాండ్లపై రాష్ట్ర పర్యటనలో ఉన్న మోడీ స్పష్టత ఇవ్వాలని వినోద్ డిమాండ్ చేశారు.  అప్పటి అటల్ బిహారీ వాజ్పాయ్, లాల్ కృష్ణ అద్వానీ బిజెపి కాదు అని, ఇప్పుడు ఉన్నది కుట్రలు, కుతంత్రాల బిజెపి మాత్రమే అని వినోద్ కుమార్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, బీజేపీ దేశంలో చిచ్చు రేపుతోంది అని ఆయన అన్నారు.  రాష్ట్రానికి రావాల్సిన 14 జాతీయ రహదారుల మంజూరు అంశం గత ఐదారేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని వాటన్నింటిపై మోడీ స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన జాతీయ రహదారులను మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు.

- Advertisement -

జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు మంజూరు చేయరా?

జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల్లో, కొత్త 24 జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు అత్యంత ఆవశ్యక అవశ్యకత ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వే లైన్లు ఇవ్వాలని, కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News