Saturday, April 12, 2025
HomeతెలంగాణVirnapalli: కే కే మహేందర్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు

Virnapalli: కే కే మహేందర్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు

కేకే గెలుస్తాడని పందెంరాయుళ్లు పందేలు

వీర్నపల్లి మండలంలోని గ్రామాల్లో సుడిగాలి పర్యటన పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కే కే మహేందర్ రెడ్డి చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఒక్కసారి అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల ప్రభుత్వా ఫలాలు ప్రజలకు అందాలంటే ఈ నెల 30 తారీకున మీ అమూల్యమైన ఓట్ల వేసి మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించాలని అన్నారు. అడవిపదిర గ్రామంలో సుమారు 50 మంది ఎర్రగడ్డ తండా గ్రామంలో 100 మంది వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టుతున్న ఆరు గ్యారెంటీలను నమ్మి ఓటు వేయాలని అన్నారు. మండలంలో కే కే మహేందర్ రెడ్డికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం వెలువెత్తుతోంది. కేకేకు మండలంలో ప్రజాదరణ పెరుగుతోందని ప్రజలు చర్చించుకుంటూ, పందేలు జోరుగా కాస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News