Friday, September 20, 2024
HomeతెలంగాణVishnu Prasad: కాంగ్రెస్ పార్టీ విజయానికి శాయశక్తుల కృషి

Vishnu Prasad: కాంగ్రెస్ పార్టీ విజయానికి శాయశక్తుల కృషి

ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ విష్ణు ప్రసాద్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయాశక్తుల కృషి చేస్తామని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర పరిశీలకుడు, చెన్నై పార్లమెంటు సభ్యుడు డాక్టర్ విష్ణు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. కొండాపూర్ లో గల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రఘునాథ్ యాదవ్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశీలకుడుగా విచ్చేసిన చెన్నై పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ విష్ణు ప్రసాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి శిక్షణ ఇస్తే, వారు ప్రజలకు వివరించడానికి సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ ఎం. రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి పీజేఆర్ హయంలో శేరిలింగంపల్లి నియోజక వర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ హయంలోనే మెట్రో రైల్, ఓఆర్ఆర్ రింగ్రోడ్డు,రాజీవ్ టెక్నాలజీ ద్వారా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగ రంగా తీర్చిదిద్దామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ గఫూర్ మహమ్మద్ ఖమర్ పాష, కాటా నరసింహ గౌడ్, కలివేముల వీరేశం గౌడ్, కార్తీక్,అమర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News