Friday, September 20, 2024
HomeతెలంగాణWarangal: సీపీఆర్ ట్రైనింగ్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

Warangal: సీపీఆర్ ట్రైనింగ్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

ప్రాణ రక్షణ ప్రక్రియ (CPR – కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) పై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరెట్ కాన్ఫెరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. MLC బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, సీపీ ఏ. వి. రంగనాథ్ గారు, అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ, శ్రీ వాత్స తదితరులు.

అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు, చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను నేడు మనం ఎన్నో చూస్తున్నామని ..సీపీఆర్ చేయటం అందరూ నేర్చుకోవాలని ఎర్రబెల్లి అన్నారు. అందుకే అందరూ కార్డియో పల్మనరీ రీససిటేషన్(సిపిఆర్). అప్పుడు శరీరంలో ఎటువంటి కదలికలు ఉండవు. అప్పుడు శ్వాస ఆడదు, పల్స్ అందదు. అటువంటప్పుడు ఈ సి.పి.ఆర్ ను వెంటనే ప్రారంభించాలన్నారు.
వరంగల్ జిల్లాలో నలుగురు మెడికల్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో సి.పి.ఆర్ పై మాస్టర్ శిక్షణ తీసుకొన్నారని.. వీరు రోజుకు 60కి పైగా మందికి శిక్షణను అందిస్తారన్నారు. మొదటి దశలో మెడికల్ ఆఫీసర్స్, సూపర్ వైసర్స్, ఎ.ఎన్.యం లు మరియు ఆశా లకు శిక్షణ అందిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ లోని ఉద్యోగులకు శిక్షణ అనంతరం మిగతా వారికి శిక్షణ ఇస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News