Tuesday, September 17, 2024
HomeతెలంగాణWarangal: ఎర్రబెల్లిని సన్మానించిన పంచాయతీ రాజ్ ఇంజినీర్లు

Warangal: ఎర్రబెల్లిని సన్మానించిన పంచాయతీ రాజ్ ఇంజినీర్లు

పంచాయితీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి ఆ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించిన కారణంగా కొందరికి ప్రమోషన్లు రావడమే కాక, పరిపాలన సౌలభ్యం కలిగిందని వారు మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా వారు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

- Advertisement -

ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమర్థవంతమైన సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వారిలో పలువురు పి అర్ ఎస్ ఇ లు, ఈ ఈ లు, డి ఈ ఈ లు, ఏ ఇ లు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News