Tuesday, September 17, 2024
HomeతెలంగాణWarangal: ప్రమాద బాధితులను స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన మంత్రి

Warangal: ప్రమాద బాధితులను స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన మంత్రి

వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం రాయ‌ప‌ర్తి మండ‌లం ఊక‌ల్ శివారులో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన‌డానికి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదానికి గురై, గాయ‌ప‌డిన యువ‌కుల‌ను రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్వ‌యంగా తొర్రూరులోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ కు తీసుకెళ్ళారు. గాయ‌ప‌డిన యువ‌కుల‌కు ద‌గ్గ‌రుండి వైద్యం చేయించారు. ఆ యువ‌కుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. వారికి అయ్యే ఖ‌ర్చుల‌ను తాను భ‌రిస్తాన‌ని చెప్పారు. గాయ‌ప‌డిన 13 మంది యువ‌కుల్లో కేవ‌లం నలుగురు మాత్ర‌మే వైద్య‌శాల‌లో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మిగ‌తా యువ‌కుల‌కు స్వ‌ల్ప‌గాయాలు కావ‌డంతో వారిని ప్రాథ‌మిక చికిత్స చేయించి, ఇళ్ళ‌కు పంపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News