Tuesday, September 17, 2024
HomeతెలంగాణWarangal: కేసీఆర్ ఫోటోకు JPSల పాలాభిషేకం

Warangal: కేసీఆర్ ఫోటోకు JPSల పాలాభిషేకం

జెపిఎస్ లతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తమను క్రమబద్ధీకరించేందుకు ప్రక్రియ చేపట్టిన సీఎం కెసిఆర్ కు, మంత్రి ఎర్రబెల్లికి ధన్యవాదాలు తెలిపారు జెపి ఎస్ లు. వరంగల్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జెపిఎస్ లు ఎర్రబెల్లిని కలిశారు. మన సీఎం కెసిఆర్ మనసున్న మహారాజని, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ ప్రక్రియను చేపట్టడం హర్షణీయం అన్నారు. జెపి ఎస్ లను రెగ్యులరైజ్ చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేశారని, ఆ కమిటీలు ప్రక్రియను చేపట్టి, నివేదికలు ఇస్తాయన్నారు మంత్రి ఎర్రబెల్లి.

- Advertisement -

కమిటీల నివేదికలు రాగానే జెపి ఎస్ లను రెగ్యులరైజ్ చేస్తామని, జీపీఎస్ ల రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన తరువాత హరీష్ రావు, నేను , చీఫ్ సెక్రటరీ సమావేశం అయ్యామని, JPSల రెగ్యులరైజ్ విధి విధానాలు చర్చించామని, జెపిఎస్ లు సీఎం కేసీఆర్ కు ఋణపడి ఉంటారు, Jps ల కుటుంబాలు జన్మ జన్మలా సీఎం కెసిఆర్ ని గుర్తు పెట్టుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News