Friday, September 20, 2024
HomeతెలంగాణWarangal: కడియం శ్రీహరి మనల్ని ఎదగనివ్వడు: మంద కృష్ణ సంచలన ఆరోపణలు

Warangal: కడియం శ్రీహరి మనల్ని ఎదగనివ్వడు: మంద కృష్ణ సంచలన ఆరోపణలు

వరంగల్ జిల్లా బిడ్డగా ..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేస్తూ, నిప్పులు చెరిగారు. గత 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగ అని చెప్పుకుంటూ కడియం శ్రీహరి రాజకీయంగా ఎదుగుతూ వచ్చి ఈ స్థాయికి వచ్చారని, కానీ ఏ ఒక్క మాదిగ బిడ్డను కడియం శ్రీహరి ఎదగనివ్వలేదని, ఎదగనివ్వరంటూ మంద కృష్ణ ఆరోపించారు. మాదిగల పేరు చెప్పి రాజకీయ లబ్ది పొందిన ఆయన తాటికొండ రాజయ్య ఎదగకుండా చేశారని కూడా మంద కృష్ణ మండిపడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన బిడ్డగా రాజకీయాల గురించి తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News