Sunday, October 13, 2024
HomeతెలంగాణWarangal: గడువులోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తవ్వాలి

Warangal: గడువులోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తవ్వాలి

పనుల ప్రగతిపై సమీక్ష

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చొంగ్తో అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చొంగ్తో ఆ శాఖ కమిషనర్, టిఎస్ఎంఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ వి. కర్ణన్, జాయింట్ కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి, కలెక్టర్ పి. ప్రావీణ్యలతో కలసి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల ప్రగతిని అధికారులతో సమీక్షించారు.

- Advertisement -


ఈ సందర్భంగా నగరంలోని ఎంజిఎం, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ సికే ఎం ప్రసూతి ఆసుపత్రి, హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ టిబి ఆసుపత్రులలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న విభాగాలు, ఉపస్థితిలో ఉన్న ఈక్విప్మెంట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి మార్పు చేసే విభాగాలు తదితర అంశాలను ఆయా ఆసుపత్రుల పర్యవేక్షకులతో వారు కూలంకషంగా చర్చించారు.
అనంతరం కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చొంగ్తో అధికారులతో కలిసి కొనసాగుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.

ఎంజిఎం ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, పీడియాట్రిక్ విభాగాలను, కెఎంసిలోని పిఎంఎస్ఎస్వై ఆసుపత్రి క్యాథ్ ల్యాబ్, డయాలిసిస్ విభాగాలను సందర్శించి ఎక్విప్మెంట్, అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ నాగేంద్ర, ఈఈ జితేందర్ రెడ్డి టిఎస్ఎంఐడిసి ఎస్ ఈ దేవేందర్, ఎం జి ఎం, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ సికే ఎం ప్రసూతి ఆసుపత్రి, హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ టిబి ఆసుపత్రుల పర్యవేక్షకులు చంద్రశేఖర్, నిర్మల, విజయలక్ష్మి, శ్రవణ్, గిరిధర్, సికేఎం ప్రిన్సిపల్ మోహన్ దాస్, వైస్ ప్రిన్సిపల్ రాం కుమార్ రెడ్డి, ఎల్ అండ్ టి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాలా సర్వే నిర్వహించండి-బల్దియా కమిషనర్, క్షేత్రస్థాయిలో నాలా పరిశీలన

రెవెన్యూ రికార్డుల ప్రకారం నాలా సర్వే నిర్వహించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. నయీం నగర్ నాలాను కమీషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి కొనసాగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు.
అనంతరం కమీషనర్ మాట్లాడుతూ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించాల్సి ఉన్నందున 3-4 రోజుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ప్రెసిడెన్సీ స్కూల్ నుండి డబ్బాల బ్రిడ్జి వరకు రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సర్వే పూర్తైన తర్వాత రిటైనింగ్ వాల్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపిన కమీషనర్ ఇందుకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి నాలా హద్దులకు చెందిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని ఈ పరిధిలో ఉన్న కోర్టు కేసుల గురించి టౌన్ ప్లానింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న ఆర్డిఓ దత్తు డి సి పి ప్రకాష్ రెడ్డి బల్దియా ఈఈ రాజయ్య ఇరిగేషన్ ఈ ఈ ఆంజనేయులు ఇరిగేషన్ డి ఈ ఈ హర్షవర్ధన్ హన్మకొండ తహశీల్దార్ విజయ్ కుమార్ స్మార్ట్ సిటీ పి ఏం సి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News