Kaloji Award: కవయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పుస్కారం లభించింది. ఈ మేరకు అందెశ్రీ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఆమెకు రేపు కాళోజీ జయంతి రోజున రమాదేవికి పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఆమె కలం ‘రమ’తో కార్టూనిస్టుగా రాణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పేరు స్టేషన్ ఘనపూర్ ఆమె స్వస్థలం. కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీజీ పూర్తి చేశారు. యూనియర్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో సీనియర్ బ్యాంక్ మేనేజర్ అయిన ఆమె ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీల్లో, స్కూల్స్ లో విద్యార్థులకు ఒరియంటేషన్ తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లో సభ్యురాలిగానూ, వ్యక్తిగత స్థాయిలోనూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రాసిన పుస్తకాలు
1. మనసు భాష ( కవిత్వం )- 2011
2 . రమణీయం ( కార్టూన్లు )- 2011
3 . మనసు మనసుకూ మధ్య ( కథలు )- 2011
4.చినుకులు ( నానీలు )- 2021
5. తల్లి వేరు ( కథలు )-2021
6 .డి . కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్-2023
7 . అశ్రువర్ణం ( కవిత్వం )-2024
8 .రమాయణం-1 ( కాలమ్స్ )-2024
పురస్కారాలు
1 .సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం ( కవయిత్రి తొలి సంపుటికి -2004 )
2 .అపురూప అవార్డు , కార్టూన్లకు (2014 )
3 .తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి (వరంగల్ జిల్లా )-రాష్ట్ర ఆవిర్భావ ప్రధమ వార్షికోత్సవం (2015 )
4 .పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం (2015 )
5 . జాతీయ సాహిత్య పరిషత్తు , సిద్దిపేట వారి ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురస్కారం (2015 )
6 . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు -కథలకు-(2017 )
7 . పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం (2017 )
8 . గుఱ్ఱం జాషువా ఫౌండేషన్ పురస్కారం ( 2018 )
9 .వెంకటసుబ్బు స్మారక అవార్డు ( 2019 )
10 .పర్చా రంగారావు స్మారక అవార్డు – (2019 )
11 . తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారం -(2021 )
12 . రాగతి పండరి స్మారక పురస్కారం- కార్టూనిస్ట్ గా బాపు రమణ అకాడమీ వారిచే (2021 )
13 . ప్రొ. వాసిరెడ్డి భాస్కర్ రావు స్మారక పురస్కారం – తల్లివేరు కథా సంపుటికి ( 2023 )
14 .ఎక్స్ రే పత్రిక ఉత్తమ కవితా పురస్కారం -2024
15 . డా. రాణీ పులోమజా దేవి స్మారక గౌరవ పురస్కారం -తల్లివేరు కథా సంపుటికి (2025 )
16. డా. సినారె సాహిత్య పురస్కారం- 2025( యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం-2025)
17. అబోపా, వరంగల్ వారి’ సాహిత్య కళానిధి’ పురస్కారం- 2025
ఇంకా ..కార్టూన్లకూ , కవిత్వం లోనూ , కథలకూ పలు బహుమతులు పొందారు.
2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ను కాళోజీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ను వరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి ఏడాది కాళోజీ జయంతి సందర్భంగా.. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజీ నారాయణ రావు అవార్డును అందజేయడం ప్రారంభించారు.


