Sunday, November 16, 2025
HomeతెలంగాణYacharam: ఉత్తమ విద్యార్థులకు నగదు ప్రోత్సాహం

Yacharam: ఉత్తమ విద్యార్థులకు నగదు ప్రోత్సాహం

యాచారం మండలం, నంది వనపర్తి గ్రామంలో ఇటీవల ప్రకటించిన పదవ తరగతి విద్యార్థులు 10/10 GPA సాధించిన 9.5/10 GPA సాధించిన నలుగురు విద్యార్థులకు తన వంతుగా ₹10,000/- అందించారు మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు భవిష్యత్ లో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జట్పీహెచ్ ఎస్ నందివనపర్తి ప్రధానోపాధ్యాయులు రమావత్ కిషన్, వివిధ ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, బోజయ్య, నాయకులు పోలమోని రామకృష్ణ యాదవ్, నర్రే శ్రీశైలం, నర్రే భాష, షాహిద్, బాబర్, కుర్షిద్, వెంకటేష్,రాములు,జంగయ్య, యాదగిరి, శివ లింగం, ప్రశాంత్, శ్రీకాంత్, రవి, యాదయ్య, రాజు, మల్లేష్, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad