Sunday, October 6, 2024
HomeతెలంగాణYadadri: ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి దళిత బంధు సెగ

Yadadri: ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి దళిత బంధు సెగ

ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు

యాదాద్రి మండల పరిధిలోని గొలెపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి దళిత బంధు సెగ తగిలింది. గ్రామానికి దళిత బంధు పథకం కింద 12 మంది ఎంపిక జరగాల్సి ఉండగా అందులో 8 మాదిగ కులస్తులు మరో నాలుగు మాల కులానికి చెందిన వారికి ఎంపిక కావాల్సి ఉండగా కొందరు గ్రామంలో పైరవీ కారుల అవతారం ఎత్తి వాళ్లకు నచ్చిన వారికి ఈ పథకాన్ని ఎంపిక చేస్తున్నారని గ్రామంలోని మహిళలు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని నిలదీశారు. గ్రామంలో దళితులందరికీ ఇస్తే ఇవ్వండి లేదంటే మొత్తానికే ఇవ్వవద్దని తేల్చి చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక విషయం సర్పంచ్ ను అడిగితే తనకేమీ తెలియదని గ్రామంలో కొంతమంది దళితులకే అప్పచెప్పామని, అది మీరే చూసుకోవాలని అంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమాలను ముగించుకొని వెళ్తున్న క్రమంలో దళిత మహిళలు పురుషులు అడ్డుకొని దళిత బంధు అర్హులైన వారందరికీ ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు లేదంటే ఎవరికి ఇవ్వవద్దని గ్రామంలో ఉన్న దళితులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ఆలోచిస్తామని ఎమ్మెల్యే వారికి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News