Thursday, April 10, 2025
HomeతెలంగాణYadadri: ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

Yadadri: ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రం అనుబంధాలయమైన శివాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఈనెల 15వ, తేదీ నుండి ఆరు రోజులపాటు కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు ఉదయం పారాయణాలు, జపములు, అనంతరం మహా పూర్ణాహుతి, త్రిశూల తీర్థ కార్యక్రమాలను సాంప్రదాయంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తి, ఈవో గీత ,చైర్మన్ నరసింహమూర్తి , ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం మంత్రపుష్ప పఠనం రాత్రి శివపార్వతుల ఏకాంత డోలోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవాలు సమాప్తి అయినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News