Friday, September 20, 2024
HomeతెలంగాణSudhir Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రపంచానికే దిక్సూచి

Sudhir Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రపంచానికే దిక్సూచి

తెలంగాణ రాష్ట్ర అద్భుత పథకాలతో ఎల్బీనగర్ శరివేగంగా అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రంలోని ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రపంచానికే దిక్సూచి అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు కటిక రెడ్డి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది యువకులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, ఎల్బీనగర్ నియోజకవర్గం వర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ఇంటి కూడు తిని రంకు మొగుళ్ళ వెంటపడినట్లు పార్టీ ఇంటి దొంగలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజల సహకారంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు అని పరోక్షంగా ప్రతిపక్షాలకు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడుస్తున్న నాయకులకు హితవు పలికారు. పక్కింటి నిండా కోళ్ళు ఉన్న తమ ఇంటి కోడే కూయాల్సి వచ్చిందని అన్నట్లు పార్టీలో ఉండి క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వారిని పార్టీలో స్థానం లేదని తెలిపారు. మంత్రి కేటీఆర్ యొక్క సహకారంతో నియోజకవర్గంలో ఫ్లై ఓవర్స్, అండర్ పాసులు నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో యావత్తు భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేని పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ మన నియోజకవర్గంలో ఉన్నాయని, ప్రతిపక్షాలు , పార్టీ ఇంటి దొంగలకు ఇది కనబడుట లేదా అని, కళ్ళు ఉండి కాలేశ్వరాన్ని చూడలేని కబోదులు అని ధ్వజమెత్తారు. ప్రజల అండదండలు ఉన్నంతకాలం ఎవరు ఏమి చేయలేరని, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కుంట్లూరు వెంకటేష్ గౌడ్, ఎల్బీనగర్ యువజన విభాగం అధ్యక్షులు ముద్ద కళ్యాణ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, అనిల్ చౌదరి, శ్రీనివాస్,గంగం శివ శంకర్ , రమేష్ నాయుడు, కాజా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News