Saturday, October 5, 2024
HomeతెలంగాణHusnabad: కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

Husnabad: కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

బాధిత కుటుంబాలకు 2 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు

బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. వివిధ సందర్భాల్లో ప్రమాదవశాత్తూ మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ సభ్యుల కుటుంబాలకు హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పిస్తోందని, ఎవరైనా కార్యకర్తలు అనుకోని రీతిలో ప్రమాదానికి గురై మృతి చెందితే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఇన్సూరెన్సు కింద ఇచ్చి ఆదుకుంటున్నదని తెలిపారు.

- Advertisement -

హుస్నాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నమిలికొండ రమేష్ మృతి చెందగా వారి సతీమణి రమాదేవి, అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామానికి ఎట్టబోయిన వీరామల్లు మృతి చెందగా వారి సతీమణి పద్మ , చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన చందా శ్వేతా మృతి చెందగా వారి భర్త సతీష్ కుమార్ పార్టీ ఇన్సూరెన్స్ రూ 2 లక్షల చొప్పున 6 లక్షల రూపాయల విలువ గల 3 బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు.

రెండు లక్షలు ఇన్సూరెన్సు కింద బాధిత కుటుంబానికి మంజూరయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ బీఆర్ఎస్ నాయకుల,ప్రజాప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణా రెడ్డి వైస్ చైర్మన్ రాజిరెడ్డి వైశాస తిరుపతి బి బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య సర్పంచులు బెజ్జంకి లక్ష్మయ్య సన్నిల వెంకటేశం సుద్దాల ప్రవీణ్ శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శివప్రసాద్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News