Sunday, February 8, 2026
HomeతెలంగాణBhatti Vikramarka : "ఆయనపై కోపాన్ని నాపై చూపిస్తున్నారు!" - పత్రికా కథనంపై డిప్యూటీ...

Bhatti Vikramarka : “ఆయనపై కోపాన్ని నాపై చూపిస్తున్నారు!” – పత్రికా కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్!

Bhatti Vikramarka on Naini coal block : “నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిని కాబట్టే, ఆయనపై ఉన్న కోపాన్ని, కక్షను నాపై చూపిస్తున్నారు!” – ఈ ఘాటు వ్యాఖ్యలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రముఖ మీడియా సంస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో, తనను లక్ష్యంగా చేసుకుని అడ్డగోలు రాతలు రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఆస్తుల కోసం కాదని స్పష్టం చేశారు. 

- Advertisement -

ప్రజా భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఓ పత్రికలో వచ్చిన కథనంపై మండిపడ్డారు.
కట్టుకథలంటూ ఆగ్రహం: “సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్‌కు టెండర్లు పిలిస్తే, దానిపై కట్టుకథలు, పిట్టకథలు అల్లి, ప్రజలను మభ్యపెట్టేలా కథనం రాశారు,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఇలాంటి రాతలు రాస్తున్నారు. వీటికి భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదు,” అని ఆయన హెచ్చరించారు.

వైఎస్‌పై కోపాన్ని నాపై : ఈ కథనం వెనుక రాజకీయ కుట్ర ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తనకున్న సాన్నిహిత్యమే దీనికి కారణమని భట్టి ఆరోపించారు.
“నేను వైఎస్‌కు సన్నిహితుడిని కావడంతో, వైఎస్‌ఆర్ మీద ఉన్న కోపం నా మీద చూపిస్తున్నారు. ఆ పత్రిక కథనం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిశాక, పూర్తి వివరాలు వెల్లడిస్తా.”
– భట్టి విక్రమార్క, తెలంగాణ డిప్యూటీ సీఎం

టెండర్లు పిలిచింది సింగరేణి, మంత్రి కాదు : ఈ టెండర్ల ప్రక్రియలో తన ప్రమేయం ఏమీ లేదని, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని భట్టి స్పష్టం చేశారు. “టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ, మంత్రి కాదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని మేం సూచించాం,” అని ఆయన గుర్తుచేశారు.

“తెలంగాణ ఆస్తులను, సింగరేణి వంటి సంస్థలను దోపిడీదారుల నుంచి కాపాడటమే నా లక్ష్యం. ఆస్తుల సంపాదన కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు,” అని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. మీడియా సంస్థల మధ్య ఉన్న వివాదాల్లోకి ప్రజా ప్రతినిధులను లాగవద్దని ఆయన హితవు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News