HomeTop StoriesHarish Rao: 'అన్నదాతతో అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్‌దే'

Harish Rao: ‘అన్నదాతతో అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్‌దే’

Harish Rao fire on Government: దేశానికి అన్నం పెట్టే రైతుతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్‌దే అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ‘X’లో షేర్‌ చేశారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-visit-in-kodangal-constituency/

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతన్నకు దిక్కెవరంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. కల్లాల్లో పంటకు కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేస్తున్నదేంటని ప్రశ్నించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/retired-ips-officers-wife-brutally-murdered-in-jubilee-hills/

‘దేశానికి అన్నం పెట్టే రైతు చేతుల మీదుగానే అధికారులను సాష్టాంగ నమస్కారం చేయించడమే ఈ ప్రభుత్వానికి ఉన్న ఏకైక ప్రత్యేకత. ఆరు నెలల పాటు మండుటెండలో పెంచి పోషించిన పంటను స్వయంగా ప్రభుత్వమే కొనడానికి నిరాకరిస్తున్నప్పుడు, ఆ రైతుకు మార్గనిర్దేశం చేసేవారు ఎవరు? రోజుల తరబడి పొలాల్లో గడుపుతూ, పంటకు కాపలా కాస్తూ, అన్నదాతలు బిచ్చగాళ్లలా నేలమీద దొర్లుతుంటే, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకోవడం తప్ప ఇంకేం చేస్తోంది? రైతులను రక్షించాల్సిన పాలకులే బెదిరింపులు జారీ చేస్తూ, మరణ శాసనాలు రాస్తున్నారు. నిస్సహాయ అన్నదాత వారి కాళ్ళపై పడి, “దయచేసి నా పంట కొనండి” అని వేడుకోవడం తప్ప ఇంకేం చేయగలడు? రైతు కన్నీటి శాపం పాలకులను కూడా వదలదు. ఆ పాపం నీడలా వారిని శాశ్వతంగా వెంటాడుతుంది.’- హరీశ్‌ రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News