Homeతెలంగాణహైదరాబాద్CM Revanth: మాదాపూర్‌ తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులు పరిశీలించిన సీఎం

CM Revanth: మాదాపూర్‌ తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులు పరిశీలించిన సీఎం

CM Revanth Tummidikunta Lake: హైదరాబాద్‌ మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైటెక్స్‌లో జరిగిన ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం.. ఆయన ఈ పనులను పర్యవేక్షించారు. చెరువు చుట్టూ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/son-commits-theft-in-own-house-for-luxurious-life/

గతంలో ఆక్రమణల కారణంగా కేవలం 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తుమ్మడికుంట చెరువుకు హైడ్రా ఆధ్వర్యంలో పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైడ్రా అధికారులు చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించి తిరిగి 28.05 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/tvk-chief-vijay-nomination-may-reject-in-perambur-for-not-mention-pending-cases/

తుమ్మడికుంట చెరువు పునరుద్ధరణతో పాటు చుట్టూ సుందరీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లను కేటాయించిందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మురుగునీరు, చెత్తాచెదారం, ట్యాంకర్ మాఫియాకు నిలయంగా మారిన ఈ ప్రాంతాన్ని పర్యావరణహితంగా, సుందరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన సీఎం.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News