బేగంపేట్ (తెలుగుప్రభ): సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీనల్ల పోచమ్మ అమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. పునర్నిర్మించిన అమ్మవారి ఆలయం ప్రారంభో త్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో బుధవారం సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ చైర్మన్ కొలన్ బాల్ రెడ్డి, అధ్యక్షుడు కొలన్ భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి గుప్త, ఉపాధ్యక్షులు శివ శంకర్ గుప్త, శ్రీనివాస్, చంద్రశేఖర్గుప్త, నాయకులు సురేష్ గౌడ్, రమేష్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, శేఖర్, అర్జున్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Also Reas: YS Jagan: “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా”

