Breaking News: మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనంలోని నాలుగో అంతస్తులో పనిచేస్తున్న ఓ విద్యా ఇన్స్టిట్యూట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే దట్టమైన పొగ అంతస్తులన్నింటికీ వ్యాపించడంతో అక్కడ ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు వెళ్లే మార్గాలు పొగతో నిండిపోవడంతో పలువురు విద్యార్థులు బాల్కనీ వైపు వెళ్లి ప్రాణాలు రక్షించుకునేందుకు కింది అంతస్తులకు దిగారు. కొందరికి ఊపిరాడక ఇబ్బందులు ఎదురవగా, మరికొందరు అక్కడికక్కడే సహాయం కోసం కేకలు వేశారు.
Read Also: Amazon Offers: స్మార్ట్ కిచెన్ కోసం స్మార్ట్ ప్యూరిఫైర్.. ఫోన్ నుంచే ఫిల్టర్ హెల్త్ చెక్ చేసుకోవచ్చు
సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతుండగా, పోలీసులు భవనం పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. పై అంతస్తుల్లో చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీ ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
వీడియో చూడండి 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

