HomeTop StoriesCrime: భర్త మరణం.. రెండు నెలలకే ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Crime: భర్త మరణం.. రెండు నెలలకే ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Mother and Children Suicide: సంగారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. భర్త తోడు లేక సాకలేననే కారణమో మరే ఇతర కారణాలో ఆమెను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/tamil-nadu-assembly-elections-congress-dmk-alliance-seats-allotted/

సంగారెడ్డి జిల్లా కంది మండలం, జూలకల్‌ గ్రామంలో కన్న తల్లే ఇద్దరు చిన్నారులకు విషమిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది. ఆపై ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మమత(28)కు కుమారుడు మణికంఠ(5), కుమార్తె ప్రళయ(4)గా గుర్తించారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/pushpa-fame-fahadh-faasil-demands-huge-remuneration-for-telugu-movies/

కాగా, ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త మృతి చెందాడు. దీంతో భర్త మరణాన్ని తట్టుకోలేక మమత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News