HomeతెలంగాణSeethakka: తెలంగాణలో 'కేరళ' స్కీం.. 'కుటుంబశ్రీ'తో పేదల జీవితాల్లో భరోసా.!

Seethakka: తెలంగాణలో ‘కేరళ’ స్కీం.. ‘కుటుంబశ్రీ’తో పేదల జీవితాల్లో భరోసా.!

Minister Seethakka: రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం కేరళలో కుటుంబశ్రీ మోడల్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సర్వే నిర్వహించిన పేదలను గుర్తించి ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ys-jagan-visited-the-former-minister-jogi-ramesh-family-ibrahimpatnam/

తెలంగాణలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందుకోసం కేరళలో విజయవంతంగా అమలవుతున్న ‘కుటుంబశ్రీ’ పథకాన్ని మోడల్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని అనుసరించి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. 

‘కుటుంబశ్రీ’ పథకం అమలు కోసం కేరళలో ఒక సర్వే నిర్వహించి.. దాని ద్వారా 65 వేల మంది పేదలను గుర్తించారని సీతక్క చెప్పారు. అర్హులకు ఈ పథకాన్ని అమలు చేసి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని వెల్లడించారు. ఆ తరహాలోనే తెలంగాణలోనూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాల ద్వార సర్వే చేయించి.. పేదరికంలో ఉన్న వారిని గుర్తించి జాబితాను రూపొందిస్తామన్నారు. 

Also Read: https://teluguprabha.net/international-news/bangladesh-national-election-2026-pre-poll-violence-update/

సర్వే పూర్తయిన అనంతరం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించి వారికి భరోసా కల్పిస్తామని వివరించారు. ఈ కొత్త పథకంతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని.. అయినా అమలు చేస్తామని రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News