Road Accident Kamareddy District: శుభకార్యానికి వెళ్తుండగా దారి కాచిన మృత్యువు తల్లీకుమారుడిని బలితీసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరి మృతితో పాటు 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.
తాడ్వాయి మండల శివారులో సోమవారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు ఆమె కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

