HomeTop StoriesSummer Effect: తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఈ సీజన్‌లోనే ఇవాళ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

Summer Effect: తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఈ సీజన్‌లోనే ఇవాళ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

Summer Effect Highest Temperatures: తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వేసవి తాపంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురై సతమతమవుతున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-clarified-four-issues-to-the-employee-unions/

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఒక్కరోజే గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్‌లోనే ఈరోజు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలుగా పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 45.8 డిగ్రీలు నమోదయ్యాయని వివరించింది. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/chief-minister-chandrababu-visited-deputy-cm-pawan-in-jubileehills/

ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ బయటకు వెళ్లడం, ప్రయాణాలు లాంటివి చేయవద్దని సూచిస్తున్నారు. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు తరచుగా నీళ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ, జ్యూస్‌ లాంటివి తాగుతూ డీహైడ్రేషన్‌ గురవకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News