HomeTop StoriesTG BJP: నేడు తెలంగాణ బీజేపీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

TG BJP: నేడు తెలంగాణ బీజేపీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Telangana BJP: ఈరోజు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పొలిటికల్ ఇన్‌ఛార్జ్‌ అభయ్ పాటిల్ భేటీ కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు,పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా ప్రతినిధుల పాత్రపై చర్చించే అవకాశం ఉంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/gujarat-titans-beat-chennai-super-kings-by-89-runs-ipl-2026/

మే 10న రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మరోవైపు జూన్‌ మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణకి రానున్నారు. ఈ క్రమంలో హైకమాండ్ పెద్దల పర్యటనలతో రాష్ట్ర బీజేపీ నేతలు సంబంధిత పనుల్లో మునిగిపోయారు. జూన్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్‌ నబీన్ హాజరు కానున్నారు. పది జిల్లాల నూతన బీజేపీ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rush-in-ttd-due-to-holidays/

త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, వార్డుల పునర్విభజన చర్, పోలింగ్‌ బూత్‌ కమిటీల బలోపేతం, టికెట్ల కేటాయింపు నియామకాలు, జూన్‌లో ప్రారంభం కానున్న SIR ప్రక్రియ ప్రధా ఎజెండాలుగా రాష్ట్ర కార్యవర్గ నేతలు చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన “మేరా భారత్, మేరా యోగ్దాన్” ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇంధన పొదుపు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహంపై పార్టీ కేడర్‌కు అవగాహన కల్పిస్తున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News