HomeతెలంగాణInter-caste : కులాంతర వివాహ ప్రోత్సాహకం.. అందని ద్రాక్ష!

Inter-caste : కులాంతర వివాహ ప్రోత్సాహకం.. అందని ద్రాక్ష!

Inter-caste marriage incentive scheme delay : కుల వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం ఓ ఉన్నత ఆశయంతో పథకాన్ని తీసుకొచ్చింది. కులాంతర వివాహాలు చేసుకుని, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జంటలకు అండగా నిలిచేందుకు ఏకంగా రూ.2.50 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కానీ, ఆచరణలో ఈ పథకం నీరుగారిపోతోంది. దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా, నిధులు అందక, వందలాది జంటలు నిరీక్షణతో వేసారిపోతున్నాయి. అసలు ఈ జాప్యానికి కారణమేంటి..? ఈ పథకం పూర్తి ప్రయోజనం లబ్ధిదారులకు ఎందుకు చేరడం లేదు..?

- Advertisement -

సమాజంలో కుల అంతరాలను తొలగించే లక్ష్యంతో, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఇతర కులాల వారు వివాహం చేసుకుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. అయితే, ఈ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 1,026 మంది నిరీక్షణ: ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే, 1,026 జంటలకు సంబంధించి సుమారు రూ.25 కోట్ల నిధులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.

అవగాహన లోపం: మరోవైపు, ఈ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడంతో, అర్హులైన అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.

జాప్యానికి కారణాలు.. లబ్ధిదారులకు ఇబ్బందులు : ఈ పథకం లక్ష్యం గొప్పదే అయినా, దాని అమలులో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో బడ్జెట్ కేటాయించకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. విడతల వారీగా, పదుల సంఖ్యలోనే నిధులు మంజూరు చేస్తుండటంతో, దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఒకవేళ నిధులు మంజూరైనా, ఆ మొత్తాన్ని దంపతుల సంయుక్త ఖాతాలో మూడేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. దీనివల్ల, తక్షణ ఆర్థిక అవసరాలకు ఆ డబ్బు ఉపయోగపడటం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు కొన్నిసార్లు ప్రాణహాని కూడా ఉంటోంది. వారికి ప్రభుత్వం నుంచి సరైన రక్షణ కరువవుతోంది.

కొందరికి ఇటీవల నిధులు మంజూరయ్యాయి. అర్జీలను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. త్వరలోనే మిగిలిన వారి ఖాతాల్లో కూడా నిధులు జమ అవుతాయి.”
– దయానంద రాణి, ఎస్సీ అభివృద్ధి అధికారిణి, సూర్యాపేట

అర్హతలేంటి.. దరఖాస్తు ఎలా : ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని నిబంధనలున్నాయి.
దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. వివాహం, 1955 వివాహ చట్టం కింద రిజిస్టర్ అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.
వివాహమైన ఏడాదిలోపు, ఈ-పాస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, నిధుల విడుదలను వేగవంతం చేయడంతో పాటు, ఈ పథకంపై గ్రామ స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనను సడలించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News