Monday, June 9, 2025
Homeహైలైట్స్Indus Waters Treaty: నీటి సంక్షోభంలో పాక్.. ఇండస్ వాటర్స్ ఒప్పందం పునరుద్ధరణ కోసం భారత్‌కు...

Indus Waters Treaty: నీటి సంక్షోభంలో పాక్.. ఇండస్ వాటర్స్ ఒప్పందం పునరుద్ధరణ కోసం భారత్‌కు నాలుగు లేఖలు

Parched Pak Wrote 4 Letters To India: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్. తీవ్ర నీటి సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్… ఒప్పందం పునరుద్ధరణ కోసం నాలుగు లేఖలు రాసిన దాయది దేశం. ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు ఒప్పందం నిలిపివేయబడుతుందని స్పష్టం చేసిన భారత్.. దేశంలోని పలు రాష్ట్రాలుకు లబ్ధి చేకూరేలా కాలువల నిర్మాణాలకు కసరత్తులు.

- Advertisement -

పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది పర్యాటకులు, మరణించడంతో భారత్ 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఒప్పందం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగింది. ఇండస్ నదీ బేసిన్‌లోని ఆరు నదులైనా – ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ – నీటి వినియోగం పంపిణీని జరిగింది. పంపిణిలో భాగంగా తూర్పు నదులు (సట్లెజ్, బియాస్, రావి) భారత్‌కు, పశ్చిమ నదులు (ఇండస్, జీలం, చీనాబ్) పాకిస్థాన్‌కు కేటాయించారు.

ప్రస్తుతం పాకిస్థాన్ నీటి కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందం ఆపివేసింది. ఈ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించాలని భారత్‌ను పాక్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా కోరారు. ఈ విషయమై ఇప్పటికి నాలుగు సార్లు లేఖల రాసి భారత్‌ను కోరినట్లు తెలిపారు. పాక్ పంపిన లేఖలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపింది. పాకిస్థాన్ ఈ విషయమై జోక్యం చేసుకోమని ప్రపంచ బ్యాంక్ ను కూడా కోరినప్పటికీ, ప్రపంచ బ్యాంక్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో, “నీరు రక్తం కలిసి ప్రవహించవు” అని తన వైఖరి ఏంటో పాకిస్థాన్ కి చెప్పకనే చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని.. పాకిస్థాన్ శాశ్వతంగా ఉగ్రవాదం వీడానాడాలని.. అలా వీడనంత వరకు ఇండస్ వాటర్ ఒప్పందం పునరుద్దరించేదే లేదని భారత్ పేర్కొంది.

భారత్ నీటి వినియోగ ప్రణాళికలు:

బియాస్ నదిని గంగా కాలువతో అనుసంధానిస్తూ.. 130 కి.మీ. పొడవైన కాలువను నిర్మించాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. దీనితో పాటుగా, ఇండస్ నదిని యమునా నదులను అనుసంధానించేందుకు ప్రతిపాదన చేస్తుంది. మొత్తం 200 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టులో.. 12 కి.మీ. పొడవున సొరంగం నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ తో పాటుగా దిల్లీ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చనుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) త్వరలో సిద్ధం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News