AP Government Schools: ఏపీ గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల కోసం విద్యాశాఖ ఓ ముఖ్య నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా,గాయపడినా, అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో ప్రథమ చికిత్స ఇచ్చేందుకు సిక్ రూమ్ లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.5 లక్షల బడ్జెట్…
రాష్ట్రంలో 629 పీఎం శ్రీ బడుల్లో ఈ సిక్ రూమ్ లు అందుబాటులోకి తీసుకునిరానున్నట్లు అధికారులు వివరించారు.ఈ సిక్ రూమ్ లను ఏర్పాటు చేసేందుకు ఒక్కో స్కూల్ కు రూ.5 లక్షల బడ్జెట్ కేటాయించగా..మొత్తం దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.
ఇప్పటికే సిక్రూమ్లకు అవసరమైన సామాగ్రి సరఫరా చేస్తుండగా.. నెలరోజుల్లో వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ మేరకు స్కూళల్లో ఒక గదిని సిక్ రూమ్కు కేటాయించి బెడ్, ప్రాథమిక చికిత్స అందించడానికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతారు.
Also Read:Khushbu: మహిళను దూషించే హక్కు మీకెవరిచ్చారు?
ఈ సిక్ రూమ్లలో స్థానిక ఏఎన్ఎం సేవలు అందించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో ఈ సిక్ రూమ్ల నిర్వహణకు సంబంధించి పాఠశాల సిబ్బంది, ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు స్థానికంగా ఉండే ఆస్పత్రి సిబ్బంది సహకారంతో విద్యార్థులకు ఆరోగ్యపరంగా అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

