Commonwealth Games 2026:స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో 11 రోజుల పాటు హోరాహోరీగా సాగిన కామన్వెల్త్ క్రీడలు 2026 ఘనంగా ముగిశాయి.జులై23న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ పోటీలు ఆదివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈసారి గ్లాస్గో నిర్వాహకులు బడ్జెట్ కారణాల వల్ల ఈవెంట్ల సంఖ్యను కుదించి, కేవలం 10 క్రీడా విభాగాల్లో మాత్రమే పోటీలను నిర్వహించారు.
74 దేశాలకు చెందిన..
అయినప్పటికీ, 74 దేశాలకు చెందిన వేలాది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా వేడుకల్లో భారత అథ్లెట్లు తమ ప్రతిభతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పాయింట్స్ టేబుల్లో టాప్-5లో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అనుకున్నది సాధించింది. భారత్ తరఫున రేసులో నిలిచిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో మొత్తం 39 పతకాలను చేజిక్కించుకున్నారు.
ఇందులో 13 బంగారు పతకాలు, 17 వెండి పతకాలు, 9 కాంస్య పతకాలు మెరిశాయి. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాల తర్వాతి స్థానంలో నిలిచి నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది.
Also Read: Tanvi Sharma:18 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన యువ కెరటం

