HomeTop StoriesGujarat Titans: గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. ప్లేయర్స్ సేఫ్!

Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. ప్లేయర్స్ సేఫ్!

Gujarat Titans : ఐపీఎల్ 2026 రన్నరప్ గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాళ్లకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం వారు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అంతా సురక్షితంగా బయటపడ్డారు.

- Advertisement -

అసలేం జరిగిందంటే..?: అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం రాత్రి గుజరాత్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కలిసి బస్సులో హోటల్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన ఆటగాళ్లు వెంటనే అప్రమత్తమయ్యారు. డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో, ప్లేయర్స్, సిబ్బంది వెంటనే కిందకు దిగిపోయారు. వారు దిగిన కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగాయి.

ఊపిరి పీల్చుకున్న క్రికెట్ ప్రపంచం: ప్రమాదం జరిగిన వెంటనే ఆటగాళ్లు కొంతసమయం పాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం ఫ్రాంచైజీ యాజమాన్యం మరో ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేయడంతో.. ఆటగాళ్లంతా సురక్షితంగా తాము బస చేసిన హోటల్‌కు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్, ఐపీఎల్ నిర్వాహకులు మరియు క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News