Gold Rate Today: దసరాకు ఇంకా మూడు రోజులే ఉంది. ప్రజలు నవరాత్రి సందర్బంగా షాపింగ్ చేసే ఈ సమయంలో స్పాట్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుదలకు అనుగుణంగా రిటైల్ రేట్లు భారీగా పెరిగాయి. గతంలో కనీసం ఊహించని స్థాయిలకు పసిడి ధరలు తమ ర్యాలీని కొనసాగించటం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు పెంచుతోంది. రోజూ పెరగటమే కానీ తగ్గటం అనే మాట వినిపించకపోవటంతో సామాన్య మధ్యతరగతి బంగారం అనే పదానికి దూరమైపోతున్నారు.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
మంగళవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.142 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 831 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,845 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.1000 పెరగటంతో రూ.లక్షా 61వేల వద్దకు చేరుకుని చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,848, ముంబైలో రూ.11,831, దిల్లీలో రూ.11,846, కలకత్తాలో రూ.11,831, బెంగళూరులో రూ.11,831, కేరళలో రూ.11,831 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,860, ముంబైలో రూ.10,845, దిల్లీలో రూ.10,860, కలకత్తాలో రూ.10,845, బెంగళూరులో రూ.10,845, కేరళలో రూ.10,845గా ఉన్నాయి.


