Gold Price Today: పండుగల సీజన్ తర్వాత బంగారం, వెండి రేట్లు ఒక్కసారిగా భారీ తగ్గింపులను చూస్తూ ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి. దీపావళి, ధనత్రయోదశి సీజన్ తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్న చాలా మంది వేచిఉన్న తెలుగు ప్రజలకు ప్రస్తుతం తగ్గిన రేట్లు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు, ఆందోళనలు తగ్గుదల కూడా లోహాల రేట్లను అదుపులోకి వచ్చేలా చేస్తోందని నిపుణులు అంటున్నారు.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
సోమవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 448 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,410 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.లక్ష 70వేలు వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,491, ముంబైలో రూ.12,448, దిల్లీలో రూ.12,463, కలకత్తాలో రూ.12,448, బెంగళూరులో రూ.12,448, కేరళలో రూ.12,448 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,450, ముంబైలో రూ.11,410, దిల్లీలో రూ.11,425, కలకత్తాలో రూ.11,410, బెంగళూరులో రూ.11,410, కేరళలో రూ.11,410గా ఉన్నాయి.


