HomeTop StoriesTirumala: నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం

Tirumala: నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం

Salakatla Vasantotsavam: కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల సన్నిధిలో వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

- Advertisement -

ఉత్సవాల ప్రత్యేకతలు: మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వసంత మండపంలో ప్రత్యేక అభిషేక నివేదనలు నిర్వహిస్తారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు బంగారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. మూడో రోజు ముగింపు రోజున మలయప్ప స్వామితో పాటు సీతారామ లక్ష్మణులు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు సైతం వసంతోత్సవ వేడుకల్లో పాలుపంచుకుంటారు.

ఆర్జిత సేవలు రద్దు: ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంను సాయంత్రం వేళల్లో ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ మూడు రోజుల పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవం ముగిసిన అనంతరం స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను తిరిగి ప్రధాన ఆలయానికి తరలిస్తారు. ప్రకృతి సిద్ధమైన సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో జరిగే ఈ వేడుకలను కళ్లారా చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News