Contempt of court: కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సర్వోన్నత న్యాయస్థానంఆదేశాలు జారీ చేసింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ను బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

