Tuesday, June 24, 2025
Homeవైరల్Delhi Metro Station: ఢిల్లీ మెట్రో‌ స్టేషన్‌లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన యువతి

Delhi Metro Station: ఢిల్లీ మెట్రో‌ స్టేషన్‌లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన యువతి


Delhi Metro Starion: పాశ్చాత సంస్కృతి భారత్‌కూ పాకింది. సోషల్ మీడియాల్ ఫేమస్ అయ్యేందుకు కొంత మంది ఎంత నీచానికి అయినా దిగజారుతున్నారు. ఇన్ స్టా‌, యూ ట్యూబ్, ఎక్స్, టెలిగ్రామ్‌లో రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే ఫేమ్ అయ్యేందుకు తహతహలాడుతున్నారు. ఇందుకోసం కొందరు జనసమూహం ఉన్న ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మరికొందరు అయితే రీల్స్ పిచ్చితో సాహసాలు చేస్తూ ప్రాణాలు సైతం కోల్పోయిన ఇన్సిడెంట్లు అనేకం ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ యువతి ప్లాట్‌ఫాంపై అసభ్యకరంగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేషన్‌లో మెట్రో ప్రయాణికులు అందరూ చూస్తుండగానే చిందులు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే, ఈ సంఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరోపక్క ప్రయాణికులు యువతి డ్యాన్స్ చేస్తుండగా అసహనానికి గురయ్యారు. దేశంలోని పలు నగరాల్లో ఇలాంటివి తరుచూ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని వీడియోలు నవ్వుకోవడానికి సరదాగా ఉంటున్నా.. మరికొందరు చేసే అతి ఇరిటేషన్ తెప్పిస్తోంది. తమకేదీ అడ్డు లేదు, ఎవరూ అడ్డులేరు.. తాము ఏమి చేసినా చెల్లుతుందని హద్దులు దాటి పైశాచిక ఆనందం పొందుతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/deputy-cm-bhatti-vikramarka-says-rythu-bharosa-created-history-in-telangana/

తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఘటనపై నెటిజన్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ‘రైల్వేలు ఇలాంటి కేసులపై చర్యలు తీసుకోలేకపోవడం బాధాకరం. ఇది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.’ అని ఒక నెటిజన్ ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సంబంధిత చట్టాల కింద అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యం. ఫిర్యాదు చేసే వరకూ పోలీసులు ఎందుకు వేచి చూస్తున్నారు? దీనిపై చర్య తీసుకోవడానికి ఏ చట్టం అడ్డు వస్తుంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి వారు తమకు అవకాశంగా మార్చుకుంటున్నారు. పోలీసులు ఇలాంటి వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’ అని మరో నెటిజన్ కోరారు. వీటిని నిషేధించాల్సిన సమయం వచ్చిందని కొందరు.. తక్షణం ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి రాండీ యాపా వేశాలు బంద్ అవుతాయని మరికొందరు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/phone-tapping-since-2018-assembly-elections/

రీల్స్ పిచ్చి పీక్‌కు చేరింది. కాగా పెరుగుతున్న టెక్నాలజీతో యువత ఏం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇది ప్రమాదకరం, చట్ట విరుద్ధం అని చెబుతున్నా, మరోపక్క ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా పదే పదే రీల్స్ మత్తులో జోగుతున్నారు. గతంలోనూ కొంత మంది రీల్స్ పిచ్చితో ఫేమస్ కావడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలకు తీవ్ర క్షోభ మిగుల్చుతున్నారు. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలుగా మిగిలుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News