Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: కర్నూల్ మోదీ సభలో వాటర్‌ బాటిల్స్‌ ఎత్తుకెళ్లిన జనం.. వైరల్‌ వీడియో

Viral Video: కర్నూల్ మోదీ సభలో వాటర్‌ బాటిల్స్‌ ఎత్తుకెళ్లిన జనం.. వైరల్‌ వీడియో

Viral Video Water Bottles In PM Modi Sabha: గురువారం కర్నూల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా జరిగింది. శ్రీశైలం మల్లన్న దర్శనానంతరం కర్నూల్‌లో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అయితే సభలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీళ్ల బాటిళ్లు, అల్పాహారంగా అరటిపండ్లు, పులిహోర ప్యాకెట్లు ఇలా పెద్ద వాహనాల్లో తరలించారు. 

- Advertisement -

అయితే సభ అనంతరం అక్కడ కట్టలకొద్దీ వాటర్‌ బాటిల్స్‌, పులిహోర ప్యాకెట్లు, అరటిపండ్లు మిగిలిపోయాయి. దీంతో వాటి కోసం జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్లుగా ప్రజలు వాటిని భుజాల మీద ఎత్తుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad