Saturday, November 15, 2025
Homeవైరల్Viral: విండో సీటులో కూర్చుని ఫోన్‌ చూస్తున్న మహిళకు ఊహించని షాక్‌.. తర్వాత ఏం జరిగిందంటే.!

Viral: విండో సీటులో కూర్చుని ఫోన్‌ చూస్తున్న మహిళకు ఊహించని షాక్‌.. తర్వాత ఏం జరిగిందంటే.!

Viral Video: బస్సు, రైలులో కిటికీ పక్కన సీటు దొరికితే చాలు.. ఆ రోజు ప్రపంచాన్నే గెలిచినంత సంబరంగా ఫీలవుతాం. చెవుల్లో ఇయర్‌పాడ్స్‌ పెట్టుకుని, నచ్చిన పాటలు వింటూ జర్నీని ఎంజాయ్‌ చేయొచ్చనే ఆశతో చాలా మంది విండో సీటు కోరుకుంటారు. ఇంకా ఓ వైపు ఫోన్‌ చూస్తూ, మరో వైపు కిటికీలోంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే రైల్వే స్టేషన్‌లో ఇలాంటి అనుభూతినే ఆస్వాదిస్తున్న ఓ మహిళకు ఊహించని షాక్‌ ఇచ్చారు ఓ పోలీసు అధికారి. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/watch-lovers-lip-lock-in-running-bus-video-goes-viral-on-social-media/

రైల్వే స్టేషన్‌లో, కదులుతున్న రైలులో ఎక్కువగా దొంగతనాలు జరగుతుంటాయి. ఇక విండో పక్కన కూర్చున్న ప్రయాణికుల దగ్గర పర్సు అందుకునేలా ఉంటే చాలా చక్యంగా దోచుకుంటారు కొందరు దుండగులు. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో కిటికీ పక్కన సీట్లో కూర్చున ఓ మహిళ ఫోన్‌ చూస్తుండగా అక్కడే ఉండి ఆమె నిర్లక్ష్య వైఖరిని గమనిస్తున్న ఆర్పీఎఫ్‌ అధికారి రీతురాజు చౌదరి వెంటనే ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నారు. షాక్‌కు గురైన ఆ మహిళ వెంటనే పక్కకి తిరిగి అరిచింది. పోలీసును చూడగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని నవ్వుతూ ఆయన చేతిలోని తన ఫోన్‌ను తిరిగి తీసుకుంది. 

ఈ క్రమంలో రైల్వే స్టేషన్లలో నిత్యం జరిగే స్నాచింగ్ సంఘటనలపై ఆర్పీఎఫ్‌ అధికారి రీతు రాజు చౌదరి ఆ మహిళను అప్రమత్తం చేశారు. రైల్లో విండో సీటు వద్ద కూర్చున్నప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad