Schools girls at Liquor Shop: ఈ వీడియో చూస్తే ఒక్కసారిగా ఉలిక్కిపడటం ఖాయం. ‘నా కళ్లు చూస్తున్నది నిజమేనా’ అని కచ్చితంగా అనుకుంటారు. అమ్మాయిలు ఇక్కడ ఉన్నారేంటి అని ఆశ్చర్యపోతారు.. అదీ స్కూల్ యూనిఫాంలో.. ఇంతకీ ఏం జరిగింది.. ఆ విద్యార్థినులు ఏం చేశారు.. ఎక్కడున్నారు.. అనే వివరాలు చూద్దాం..
Also Read: https://teluguprabha.net/viral/mother-brought-band-melam-for-daughters-to-wake-up/
స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థినులు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వైన్ షాపు వద్ద నిలబడ్డారు. అంతే కాదు అక్కడ మద్యం కొనుగోలు చేశారు. ముఖం కనపడకుండా ఓ అమ్మాయి స్కార్ఫ్ కట్టుకుంటే.. ఇంకో బాలిక చున్నీతో కవర్ చేసింది. ఈ విచిత్రాన్ని అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కళ్లప్పగించి చూస్తున్నారు.. ఏంటిదీ అని.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నైన్పూర్లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లిన ఇద్దరు స్కూల్ విద్యార్థినులు అక్కడ మద్యాన్ని కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానిక వార్తా ఛానల్లో ప్రసారమైన ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో దర్యాప్తు చేపట్టారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) అశుతోష్ ఠాకూర్, తహసీల్దార్, స్థానిక పోలీసులతో కలిసి ఆ ప్రభుత్వ లిక్కర్ షాపు వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు.
కాగా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బాలికలకు మద్యం అమ్మడంపై వైన్ షాపు సిబ్బంది అధికారులు ఆరా తీశారు. ఆ విద్యార్థినులు వారంతట వారే ఇక్కడకు వచ్చారా.. లేక ఎవరైనా వారిని పంపించారా.. అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. షాపు యజమానిని సైతం విచారిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఎస్డీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
भाजपा सरकार की शराब की दुकान अब स्कूली छात्राओं तक पहुंच गई है… नियमानुसार नाबालिगों को शराब नहीं बेची जा सकती है लेकिन शराब प्रेमी सरकार यह भी कर गुजरना चाहती है। pic.twitter.com/9yOStqNOvW
— Ravindra Sahu Jhoomarwala (@RavindraSahuINC) October 25, 2025


