Viral news Today: చిన్నప్పుడు పిల్లలు తెలియక ఏవేవో వస్తువులను మింగేస్తుంటారు. వారికి ఇబ్బంది కలిగితే తప్ప ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పరు. అయితే అలా చిన్నతనంలో చేసిన ఓ వ్యక్తి చేసిన అల్లరి పని 52 ఏళ్ల తర్వాత అతడిని హాస్పిటల్ పాలు చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివాల్సిందే.
చైనాకు చెందిన యాంగ్ అనే వ్యక్తి 12 ఏళ్ల ప్రాయంలో టూత్ బ్రష్ను మింగేశాడు. అయితే ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అది కడుపులో కరిగిపోవడమో, మలం ద్వారా వచ్చేస్తోందేమోనని అతడు అనుకుని జీవితాన్ని కొనసాగించాడు. టూత్ బ్రష్ పొట్టలోనే ఉన్నప్పటికీ 50 ఏళ్లలో ఏ రోజు దాని వల్ల ఇబ్బంది పడింది లేదు. ప్రస్తుతం అతడి వయసు 64 ఏళ్లు.
ఇటీవల యాంగ్ గ్యాస్ట్రిక్ సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అతడికి స్కానింగ్ చేసి పరిశీలించగా.. పేగుల్లో టూత్ బ్రష్ ఉన్నట్లు గుర్తించారు. 52 సంవత్సరాలపాటు అతడి శరీరంలోనే ఉన్న బ్రష్ ఎలాంటి ఇబ్బంది కలిగించకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి కలిగిస్తోంది. తాజాగా యాంగ్ కు ఎండోస్కోపిక్ సర్జరీ చేసి ఆ బ్రష్ ను తొలగించారు. ఇది 17 సెంటీమీటర్ల పొడవుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఐదు దశాబ్దాలుపాటు ట్రూత్ బ్రష్ శరీరంలో ఉన్నా అతను జీవించి ఉండటం నిజంగా అదృష్టమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం యాంగ్ పూర్తి కోలుకున్నట్లు తెలుస్తోంది.