Woman molested in Running bus Video: రోజురోజుకు స్త్రీలపై కామాంధులు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. పబ్లిక్ ఫ్లేస్ అని చూడకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదలడం లేదు. కామంతో పశువుల కంటే హీనంగా ప్రవరిస్తున్నారు. బస్సులు, మెట్రోలు, రైళ్లు..ఎక్కడపడితే అక్కడ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. బస్సులో ఓ వ్యక్తి పక్కనే కూర్చున్న తోటి ప్రయాణికురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె నిద్రలోకి జారుకున్న సమయంలో ఆమె ప్రైవేటు పార్ట్ లను టచ్ చేస్తూ పైశాచికంగా ఆనందం పొందాడు. ఏకంగా ఆమె ఇన్నర్స్ లో చేయి పెట్టి నీచంగా ప్రవర్తించాడు. దీంతో మేల్కోన్న ఆ మహిళ ఆ నీచుడిని చితకబాదింది. అంతేకాకుండా ఆ కామాంధుడు చేసిన చేష్టలను కండక్టర్ తోపాటు ఇతరులకు చెప్పడంతో బస్సులో పెను దుమారం చెలరేగింది. అతగాడు చేష్టలను తన ఫోన్ లో రికార్డు చేసిన ఆ యువతి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఆ కామాంధుడి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ ఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది.
దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురవుతోంది. ఆడది బయటకు వస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయే కొన్ని వేళ కళ్ల మధ్య నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఆడవారిని ఇలాంటి ఘటనలు వారిని మళ్లీ వంటింటికే పరిమితం చేసే అవకాశం ఉంది. కామాంధులు చేస్తున్న పనులకు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది. తమ పిల్లలు ఏం చేస్తున్నారో వారి తల్లిదండ్రులు గమనించి భయం చెప్పాలి, లేకపోతే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి.
Also Read: Viral -ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. కట్ చేస్తే..!


