Friday, September 20, 2024
HomeతెలంగాణVeernapalli: 108 అంబులెన్స్ లో కాన్పు

Veernapalli: 108 అంబులెన్స్ లో కాన్పు

పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు చూలాలు 108 అంబులెన్స్ లోనే పండంటి బిడ్డను ప్రసవించింది. వీర్నపల్లి మండలంలోని శాంతి నగర్ లో ఈ ఘటన జరిగింది. గూగులోత్ సంగీత అనే గర్భిణీ కి పురిటి నొప్పులు రావడంతో 108 కి కాల్ చేశారు. వెంటనే స్పందించిన వీర్నపల్లి 108 సిబ్బంది స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఎల్లారెడ్డిపేట్ మండల్, హరిదాస్ నగర్ గ్రామ చివరిలో మార్గ మధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 మెడికల్ టెక్నిషన్ మధు అంబులెన్స్ లొనే పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News