Tuesday, April 29, 2025
HomeతెలంగాణChevella: 16 లక్షలు పలికిన చేవెళ్ళ వినాయక లడ్డు

Chevella: 16 లక్షలు పలికిన చేవెళ్ళ వినాయక లడ్డు

వేలం పాటలో..

చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పీఏసీఎస్ చైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి రూ.16లక్షల 3వేలకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు.

- Advertisement -

కాగా, ఇక్కడ లడ్డు వేలం పాటలో పాల్గొనాలంటే ముందుగానే రూ. 5 వేలు డిపాజిట్ చేయాలని కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. వీరందరితో పాటు నిమజ్జనానికి సహకరిస్తున్న పోలీసులను సన్మానించి.. స్వామివారి ప్రసాదం అందించారు. అనంతరం వేంకటేశ్వర స్వామి వారి గుండం వరకు డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాల మధ్య శోభాయాత్ర నిర్వహించి.. అందులో నిమజ్జనం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News