Saturday, September 21, 2024
HomeతెలంగాణKamareddy: బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు

Kamareddy: బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు

ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బిజెపి సభ్యత్వం తీసుకునేలా చూడాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్, వ్యాపారస్తుల సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం 39 వ వార్డు పరిధిలో కాలనీవాసులచే సభ్యత్వ నమోదు చేయించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలు వివరించి బీజేపీ సభ్యత్వం తీసుకోమని అడగాలని, సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనీ అన్నారు. సభ్యత్వంలో బీజేపీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటుందని అన్నారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని అన్నారు. వ్యాపారులు, సీనియర్ సిటిజన్స్ బీజేపీ వెంటనే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు భరత్, కౌన్సిలర్లు శ్రీనివాస్, నరేందర్, నాయకులు వేణు, వీరేశం, సరోజ, అనిత, వెంకట్ రెడ్డి, రాజగోపాల్, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News