Monday, September 23, 2024
HomeతెలంగాణHuzurnagar: బీజేపీలో చేరండి: బొబ్బా భాగ్యరెడ్డి

Huzurnagar: బీజేపీలో చేరండి: బొబ్బా భాగ్యరెడ్డి

హుజుర్ నగర్ పట్టణంలో..

హుజుర్ నగర్ పట్టణంలోని వర్తక సంఘం భవనం నందు నిర్వహించిన బిజెపి సంస్థాగతం జిల్లా సంయుక్త మోర్చాల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ…ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినా భారతీయ జనతా పార్టీలో ప్రజలందరూ సభ్యత్వం తీసుకోవాలన్నారు… నాయకులు అందరూ ప్రతి బూత్ లో 100 కి పైగా సభ్యత్వాలు తగ్గకుండా చేయాలన్నారు.

- Advertisement -

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది అన్నారు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం కోసం 8800002024 కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆన్లైన్లో సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకురాలు చల్లా శ్రీలత రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు, యశ్వంత్ అసెంబ్లీ కన్వీనర్ అంబళ్ల నరేష్ గౌడ్, కో-కన్వీనర్ గుండెబోయిన వీరబాబు, జిల్లా నాయకులు, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News