Tuesday, September 24, 2024
HomeతెలంగాణPatancheru: మంత్రులెరూ రాలేదనే నిరాశ వద్దు, నేనున్నాగా: గూడెం మహిపాల్

Patancheru: మంత్రులెరూ రాలేదనే నిరాశ వద్దు, నేనున్నాగా: గూడెం మహిపాల్

ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తా..

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈమేరకు హామీ ఇచ్చారు పటాన్చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి.

- Advertisement -

ఎన్నికల హామీ మేరకు..
ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రేషన్ డీలర్ కు 5 వేల రూపాయల గౌరవ వేతనం, క్వింటాలుకు 300 రూపాయల కమీషన్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు ఎవరు రాలేరని డీలర్ నిరాశ చెందొద్దని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి బోసు జి, రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు 10 వేల మంది రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News