Friday, September 20, 2024
HomeతెలంగాణTanduru: మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి

Tanduru: మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి

జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 150కు పైగా యువకులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. విచక్షణారహితంగా పిల్లలను, వృద్ధులను. ఆడవారిని చూడకుండ ఇంటిపై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. ఎమ్మెల్యే పై మురళీకృష్ణగౌడ్ ఆరోపణలు చేశారనే ఇంటిపై దాడి జరిగినట్టు సమాచారం.

- Advertisement -

ఈ విషయం తెలుసుకుని బీజేపీ నేతలు, కార్యకర్తలు వెంటనే మురళీకృష్ణగౌడ్ ఇంటికి చేరుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు పరిపోయినట్లు సమాచారం. మురళీకృష్ణాగౌడ్ సోదరుడు రఘునందన్ పై దాడి చేసి ఘోరంగా గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాత్రికి రాత్రే తాండూర్ బయలుదేరేందుకు సిద్ధం కాగా పోలీసులకు సమాచారం అందడంతో వారిని అక్కడే అడ్డుకున్నారు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News